చౌరస్తాలో చెంచు జాతి చల్లపల్లి స్వరూపరాణి అడవిలో మానుల్లో వొకానొక మానులాగా అప్పుడే మోవులు తొడిగిన లేత పచ్చ ఆకులాగా స్వచ్చంగా పెద్దగా మాట్లాడకుండా యితరుల్ని చూస్తే మొహమాటంగా , బిడియంగా కనిపించే రాతియుగపు మనిషికి నికార్సైన ప్రతినిధి చెంచు . చెంచులు ఆదిమ మానవ తెగలలో ద్రావిడ జాతికి చెందిన వొకానొక ఆటవిక తెగకి చెందిన వారు . ' చెట్టు ’, ' చుంచు ’ వంటి పదాల నుంచి ' చెంచు ’ అనే పదం వొచ్చిందని పరిశోధకులు అంటారు . తెలుగు రాష్ట్రాలలో గుర్తించబడిన 33 గిరిజన తెగలలో చెంచులు మిగతా వారందరికంటే మరింత మూలకి నెట్టబడిన వీరు యెక్కువగ కర్నూలు , ప్రకాశం , ప్రస్తుత తెలంగాణా రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలలో విస్తరించిన నల్లమల అడవులలోనూ కృష్ణా , గుంటూరు , కడప మొదలైన జిల్లాలలోని మైదాన ప్రాంతాలలో అరుదుగా నివసిస్తుంటారు . చెంచులు ప్రధానంగా ఆటవిక జాతి వారే ! పాల్కురికి సోమనాధుడు రాసిన ' పండితారాధ్య చరిత్ర ’ లో ఆయన చెంచుల గురించి పేర్కొన్నాడు . నల్లమల అడవిలో వున్న ప్రముఖ శైవ క్ష...
విముక్తి కోసం బౌద్ధధర్మం చల్లపల్లి స్వరూపరాణి ' పీడిత కులస్థులెపుడూ తమ అస్తిత్వ పునాదులపై నిలబడి పోరాడాలి తప్ప ఆధిపత్య మతాలలోకి కాందిశీకులుగా వెళ్ళకూడదు ’ అని తమిళ దళిత బౌద్ధ ఉద్యమకారుడు పండిత అయోతీదాస్ అంబేద్కర్ కంటే యాభై సంవత్సరాలకు ముందు చెప్పాడు . అయోతీదాస్ , అంబేద్కర్ ల స్థల , కాలాలు వేరు . వీరిద్దరికీ ఒకరికొకరు తెలీదు . కాని ఒకేలాగ వీరిద్దరు ఆలోచించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది . క్రీస్తుకు పూర్వం ఆరవ శతాబ్ది వాడయిన గౌతమ బుద్ధుడు అప్పటికి సామాజిక , ఆధ్యాత్మిక రంగాలలో...
Comments
Post a Comment