Posts

Showing posts from September, 2019

Jogini Daughter Susila- Essay

Image
జీవితపు ఆటలో గెలిచిన మాతంగి బిడ్డ సుశీల                                                                       చల్లపల్లి స్వరూపరాణి సమాజం వారిని చిన్న చూపు చూసింది. మతం పేరుతో ఊరుమ్మడి వస్తువుని చేసింది. ఊరు బాగుండాలంటే మాతమ్మలు చిందేయాలంది. వర్షాలు కురిసి భూములు పండాలంటే మాతమ్మ పూనకం తెచ్చుకుని సిడి మాను ఎక్కాలంది. అయినా ఆమె తన స్వయం శక్తితో తన తలరాత మార్చుకుంటుంది. ఆమే పద్దెనిమిదేళ్ళ కొండా సుశీల. జాతీయ స్థాయి హాకీ క్రీడాకారిణి.   ఆమె తల్లి ఒక ‘మాతంగి’, మాదిగ కులంలో పుట్టింది. ఆమెది చిత్తూరు జిల్లా, చంద్రగిరి మండలం, తొండవాడ గ్రామం. ఆమె తల్లి తన మేనమామ సహాయంతో ఆ మురికి కూపం నుంచి బైటకొచ్చి పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలనుకుంది. తన పాత పేరు ‘మాతమ్మ’ తానున్న బురదని సూచిస్తుందని ‘రేణుక’ గా మార్చుకుంది. అయినా కొత్తపేరు ఎవరికీ పెద్దగా తెలీదు. అందరూ ఆమెని ‘మాతమ్మ’ అనే పిలుస్తారు. ఆచారం వొదిలినా, పేరు మార్చుకున్నా దురదృష్టం భర్తగా మారి   ఆమెని వెంటాడింది.   చేసుకున్నవాడు పచ్చి తాగుబోతు, పైసా సంపాదించకుండా భార్యని బండబూతులు తిట్టి, కొట్టేవాడు , ఆమె గతాన్ని పదే పదే గుర్తుచ

Jogini- Essay

Image
రాచ పుండు ‘థియోగమీ’                                                 చల్లపల్లి స్వరూపరాణి ఇక్కడంతా దేవుడి పేరు మీదే జరుగుతుంది. కవి పైడి తెరేష్ బాబు అన్నట్టు దేవుడు అసమానతల్ని సృష్టించి కొందరి ఆత్మగౌరవాన్ని ధ్వంసం చేస్తాడు. ఈదేశంలో కనీసపు మనిషి హోదా పొందని నికృష్ట జీవి అయిన జోగినీని సృష్టించినదీ ఆ దేవుడే! ఆమధ్య తెలంగాణలో ‘మొగుడనేవాడు మనిషైతే అతడు చనిపోయినప్పుడు నేను వితంతు పెన్షన్ కి అర్హత పొందుతాను, కానీ నా మొగుడు దేవుడైపాయే ఆడెప్పుడు సచ్చేది, పెన్షన్ ఎప్పుడోచ్చేది? అని ఒక జోగినీ అడిగిన ప్రశ్నకి అంతరిక్షంలోకి దూసుకెళ్తున్న నాగరిక సమాజం సమాధానం చెప్పలేదు... ఆమెని సృష్టించిన ఆ మాయదారి దేవుడు బదులు పలకలేడు... ఒకపక్క ప్రభుత్వాధినేతలే పోతురాజుల్ని, జోగినీలను ప్రోత్సహిస్తూ నగరం నడిబొడ్డున జాతర చేస్తూ, ‘రంగం’ చెప్పించుకుంటుంటే జోగినీల ప్రశ్నలకు ఎవరైనా ఎందుకు   బదులిస్తారు? రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా సుమారు ఎనభై వేల మంది జోగినీలు, బసివిలు, మాతమ్మలు, దేవుడమ్మలుగా కొనసాగుతున్నారంటే ఈ సమాజం ఎటు వెళ్తున్నట్టు? 1988 జోగినీ నిరోధక   చట్టం అచ్చం ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరో

Tributes to Toni Marrison

Image
బ్లాక్ బుక్- టోనీ మారిసన్ “ Race is the least reliable information you can have about someone. It’s real information, but it tells you next to nothing”     - Toni Morrison ఆమెకి జాలి జాలి మాటలంటే అసహ్యం, కన్నీటి మూటలంటే చీదర... అందుకే తన పాత్రల్ని సానుభూతికి అందనంత ఎత్తులో నిలిపి నల్లజాతి ప్రజల జీవన పోరాటానికి గొప్ప సాహిత్య గౌరవాన్నిచ్చింది టోనీ మారిసన్. ఆత్మగౌరవం కంటే ప్రాణాలు ఖరీదైనవి కావని, బానిసత్వపు కోరల్లో జీవన్మ్రుతుల్లా బతకడం కంటే చావడం మేలని కన్నబిడ్డను చేతులారా చంపుకున్న నల్లతల్లి,   సమాజం తన లేమిని, రంగుని త్రుణీకార దృష్టితో చూస్తుందని తెల్లవాళ్ళకు వలే తనకి కూడా   అందమైన నీలి కళ్ళు ఉంటే బాగుందని ఆ నీలి కళ్ళ కోసం ఆరాటపడే నల్లజాతి అమ్మాయి వంటి సజీవమైన పాత్రలతో   జాత్యాహంకార సాహిత్య విలువలపైన పెద్ద తారుడబ్బా కుమ్మరించిన ధిక్కారి టోనీ మారిసన్.   అవును, సాహిత్యంలో నోబుల్ బహుమతి పొందిన మొదటి ఆఫ్రో-అమెరికన్ రచయిత్రి టోనీ మారిసన్ పాత్రలన్నీ వివక్ష, పీడనలపైన ధిక్కార పతాకాన్ని ఎగరేసి జాత్యాహంకారానికి, దాని తాలూకు అన్ని రకాల దాస్తీకాలకు ఎదురు నిలిచినవే. టోనీ మారిసన్ అ

Narabali-Poem

నరబలి చల్లపల్లి స్వరూపరాణి ఇక్కడ   కుమ్మరోడికి కుండ కరువు నేతగాడికి గుడ్డ దొరకదు మట్టి పిసికి గరిసెలు నింపే సేద్యగాడింట్లో అన్నం నిండుకుంటది కాటికాపరికి బొందల గడ్డలో ఆరడుగుల నేల పుట్టదు ... చచ్చినాక బ్రాహ్మడైనా చండాలుడైనా ఒక్కటే అన్నావు అన్నమయ్యా! మేము చచ్చినా   పూడ్చుకోడానికి కాసింత జాగా దొరకదని ఎన్నిసార్లు రుజువయ్యిందో చూశావా! బతికినన్నాళ్ళూ కర్ర బుచ్చుకుని తరిమే కులం చావులోనూ మనిషిని కుళ్ళబొడుస్తుంది బడిలో, గుడిలో, నీటిలో, తిండిలో, ఆఖరుకి కాటిలో నీడలా వెంటాడే సైతాన్ కులం .. . ఇక్కడి నేలకీ కులముంది కులమున్నోడికే భూమి కులం తక్కువోడు భూమి కావాలన్నప్పుడల్లా ‘నరబలి’ కోరుతుంది కులం ... కులం నాలిక మచ్చలమారిది కానీ, నేల   అబద్ధమాడదు పత్రాలతో దస్త్రాలతో దానికి పనిలేదు ... ఏ శవం కార్చిన చెమట బొక్కెనలతో తాను తడిసి ముద్దయ్యిందో ఎవరి చేతిలో చదునై తను పంటయ్యిందో మట్టికి తెలుసు ... ఎవరు తనని వొంటికి పులుముకుందీ ఏ మట్టి బిడ్డలు తన వీపుమీద అంబాడిందీ తనకి   గుర్తే ... చెరబట్టేవాడెవడైనా తనని ముద్దాడే మ

Nallamalla- Poem

నల్ల మల్ల చల్లపల్లి స్వరూపరాణి నల్లమలా! చిక్కని ప్రక్రుతి సోయగమా! నిన్ను చూస్తే పురాజ్ఞాపకాల ఉసిళ్లు భళ్ళున లేస్తాయి రంగురంగుల పూల సుగంధాలు రకరకాల పిట్టల గానం లోపలి పొరల్ని   సమ్మోహనంగా తాకుతాయి. జీవం నిండిన   నల్ల చలవ పందిరీ! కొండలపై వెన్నెల్ని మేసి వాగువంకల్ని వొరుసుకుంటూ దుప్పిలా పరుగెత్తిన చరిత్ర మా చూపుని శుభ్రం చేసేది. రేలపాటలు పాడే   వెదురు పూల వనమా!   నువ్వొక తత్వాల బైరాగివి సిద్దుడి మూలికవి పతి భక్తిని ఈడ్చితన్నిన అక్కమహాదేవి ధిక్కారానివి జనారణ్యంలోడస్సిపోయిన మనిషిని సేదదీర్చే సెలయేరువి మైదానాలను కాసే బయలుదేవరవి! అరమరికలులేని సమస్త జీవుల   వువ్వెత్తు జాతరవి   నల్లమలా! నాగరికత పన్నిన అభివృద్ధి కుతంత్రానికి గుండెపగిలి రోదిస్తున్న నిధి నిక్షేపమా! అక్కడక్కడ మినుకుమనే చుట్టుగుడిసెలు ఆది మానవుడి శిలాజాల్లాంటి అడవి బిడ్డలు ఆకుపసరుతో కలిసిపోయిన మనిషివాసన ఇక పొగచూరబోతుందా? విరగబూసిన ఇప్పపూల వనమా! చెంచిత కొప్పున మెరిసే   బంతిపూల దరహాసమా! నువ్విక నల్లపూసవేనా? నిన్ను కధల్లోకెక్కించి పేదరాసి పెద్దమ్మన

Krisha river-Poem

కృష్ణా నది                                                                                                              చల్లపల్లి స్వరూపరాణి ఒరే , కృష్ణా! నువ్ వేదంలా ఘోషించకపోయినా   సూత రుక్కువై   మా చెవుల తుప్పు వదిలించావు పైన చూపులకి నలుపైనా   నీ నిలువెల్లా బలుపే   కృష్ణా , నువ్వు నెత్తురై వురికావు తప్ప అసలు నీరై ఎప్పుడు ప్రవహించావు ? ఓడ్చే చెమట కుండ వెలివాడ   నీ నల్ల రేగడి చాళ్ళని తడిపి నిన్ను ధాన్యాగారాన్ని చెయ్యలేదా ?   వానాకాలం నీ లోతట్టు ప్రాంతమంతా గుడిసెల కన్నీటిమయం కదా!   కృష్ణా , నిజం చెప్పు! ఎన్ని మిస్సింగ్ శవాలను   మింగి తేన్చావో వాడు గడ్డిలో కుక్కి కాలవలో పాతిన   పాలేరు దట్టాలు   లాకుల దగ్గర ఆగి గడ్డిపోచకోసం రాత్రంతా మేల్కొనేవి ఇక్కడి భూములేలు దొరల క్రౌర్యం   కిష్ట కాలవలో వెల్లువెత్తుతుంది   ఆలీసమ్మ నెత్తురుతో   మద్రాసు కాల్వ   బరీగా తొణికిసలాడుతుంది చూడు!   నీ గట్టుమీద మొలిచిన   తధాగతుడ్ని తరిగిపోసి   రేవుకో గుడికట్టిన కధకి   నువ్వేకదా సాక్షివి! నిజం చెప్పు , మేటలేసిన కర్ర పెత్తనం   కూలోడిని పిండుకు తాగి   నడమంత్రపు సిరి తట్టలక