పీడిత ప్రజల్ని గెలిచిన మహారాజు సాహూ చల్లపల్లి స్వరూపరాణి చత్రపతి సాహూ మహరాజ్ మహాత్మా ఫూలే తర్వాత బ్రాహ్మణేతర వుద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడమే కాకుండా దళిత బహుజనులను బ్రాహ్మణాధిపత్యం నుండి విముక్తి చెయ్యడానికి అటు పాలనా పరంగానూ , ఇటు సైద్ధాంతికంగానూ కృషి చేశాడు . శివాజీ మరణించిన 200 సంవత్సరాల తర్వాత ఆ వంశానికి వారసుడిగా సాహూ మహరాజ్ కొల్హాపూర్ సంస్థానానికి రాజై పాలకవర్గ స్వభావానికి భిన్నంగా బ్రాహ్మణ వ్యతిరేక వుద్యమకారుడిలాగా అట్టడుగు కులాల అభివృద్దికి సరికొత్త నమూనా తయారు చేశాడు . విద్య , వైద్య , వ్యవసాయ రంగాలన్నింటిలో అణగారిన వర్గాలకు అనుకూలమైన విప్లవాత్మక...
చౌరస్తాలో చెంచు జాతి చల్లపల్లి స్వరూపరాణి అడవిలో మానుల్లో వొకానొక మానులాగా అప్పుడే మోవులు తొడిగిన లేత పచ్చ ఆకులాగా స్వచ్చంగా పెద్దగా మాట్లాడకుండా యితరుల్ని చూస్తే మొహమాటంగా , బిడియంగా కనిపించే రాతియుగపు మనిషికి నికార్సైన ప్రతినిధి చెంచు . చెంచులు ఆదిమ మానవ తెగలలో ద్రావిడ జాతికి చెందిన వొకానొక ఆటవిక తెగకి చెందిన వారు . ' చెట్టు ’, ' చుంచు ’ వంటి పదాల నుంచి ' చెంచు ’ అనే పదం వొచ్చిందని పరిశోధకులు అంటారు . తెలుగు రాష్ట్రాలలో గుర్తించబడిన 33 గిరిజన తెగలలో చెంచులు మిగతా వారందరికంటే మరింత మూలకి నెట్టబడిన వీరు యెక్కువగ కర్నూలు , ప్రకాశం , ప్రస్తుత తెలంగాణా రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలలో విస్తరించిన నల్లమల అడవులలోనూ కృష్ణా , గుంటూరు , కడప మొదలైన జిల్లాలలోని మైదాన ప్రాంతాలలో అరుదుగా నివసిస్తుంటారు . చెంచులు ప్రధానంగా ఆటవిక జాతి వారే ! పాల్కురికి సోమనాధుడు రాసిన ' పండితారాధ్య చరిత్ర ’ లో ఆయన చెంచుల గురించి పేర్కొన్నాడు . నల్లమల అడవిలో వున్న ప్రముఖ శైవ క్ష...
Comments
Post a Comment