చౌరస్తాలో చెంచు జాతి చల్లపల్లి స్వరూపరాణి అడవిలో మానుల్లో వొకానొక మానులాగా అప్పుడే మోవులు తొడిగిన లేత పచ్చ ఆకులాగా స్వచ్చంగా పెద్దగా మాట్లాడకుండా యితరుల్ని చూస్తే మొహమాటంగా , బిడియంగా కనిపించే రాతియుగపు మనిషికి నికార్సైన ప్రతినిధి చెంచు . చెంచులు ఆదిమ మానవ తెగలలో ద్రావిడ జాతికి చెందిన వొకానొక ఆటవిక తెగకి చెందిన వారు . ' చెట్టు ’, ' చుంచు ’ వంటి పదాల నుంచి ' చెంచు ’ అనే పదం వొచ్చిందని పరిశోధకులు అంటారు . తెలుగు రాష్ట్రాలలో గుర్తించబడిన 33 గిరిజన తెగలలో చెంచులు మిగతా వారందరికంటే మరింత మూలకి నెట్టబడిన వీరు యెక్కువగ కర్నూలు , ప్రకాశం , ప్రస్తుత తెలంగాణా రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలలో విస్తరించిన నల్లమల అడవులలోనూ కృష్ణా , గుంటూరు , కడప మొదలైన జిల్లాలలోని మైదాన ప్రాంతాలలో అరుదుగా నివసిస్తుంటారు . చెంచులు ప్రధానంగా ఆటవిక జాతి వారే ! పాల్కురికి సోమనాధుడు రాసిన ' పండితారాధ్య చరిత్ర ’ లో ఆయన చెంచుల గురించి పేర్కొన్నాడు . నల్లమల అడవిలో వున్న ప్రముఖ శైవ క్ష...
తానే ఒక వేకువ పిట్టయి గంటేడ గౌరు నాయుడు అమ్మ చీర కొంగు నుంచి ప్రపంచాన్ని చూసి కవిత్వం చెప్పడమంటే గుండె ఘోషను ఆవిష్కరించడమేనని, ఆత్మగౌరవ పరిరక్షణ, ఆత్మగౌరవ ప్రకటన అని, జీవితమే కవిత్వానికి ముడిసరుకుగా స్వీకరించి తనదైన అను భూతిని అక్షరీకరించి తన అక్షరాల్ని మన కళ్ళలో ఎర్రజీరలుగా, అశృధారలుగా మార్చగలిగే సక్తివంతురాలైన కవిగా సాక్షాత్కరిస్తుంది చల్లపల్లి స్వరూపరాణి. దళిత ఉద్యమం కుల, వర్గ అణచివేత గురించి మాట్లాడిందని, దళిత పురుషుల కోణం నుంచి ఎక్కువగా మాట్లాడిందని, స్త్రీవాద ఉద్యమం మధ్య తరగతి అగ్రకుల మహిళల గురించే మాట్లాడిందని అనుకుంటే పీడితులలోకెల్లాపీడితులైన దళిత మహిళా తన గురించి తానూ మాట్లాడవలసిన అవసరాన్ని గుర్తించి తన అనుభవ తీవ్రతలోంచి, అవమానాల, ఆగ్రహావేశాల్లోంచి నోరు విప్పిందని స్పష్టం చేస్తుంది ఈ వేకువపిట్ట. ఆధిపత్య సంస్కృతే అందరి సంస్కృతి కాదని, అందరిదీ ఓకే సంస్కృతిగా మారే భవిష్యత్తును కాంక్షిస్తూ కలగంతుంది ఈ వేకువపిట్ట. “కులం, వర్గము, ఆధిపత్యము ఈ సమాజంలో ఉన్నంతవరకూ నిరంతర పోరాటం సాగుతూనే ఉంటుంది” అంటుంది ఈ వేకువపిట్ట, ఆ పోరాటాలకు ఊపిరి పోస్తుంది ఈ వేకువపిట్ట. ...
సందేశాత్మక వేకువ పిట్ట! అరణ్యకృష్ణ ఇంతటి సామాజిక దుఃఖాన్ని , ఆక్రోశాన్ని నింపుకున్న కవిత్వాన్ని ఈ మధ్య కాలంలో చదవలేదు. ఇందులో ఉన్నది సానుభూతి కాదు , సహానుభూతీ కాదు. ఉన్నదల్లా గుండెపగుళ్ళ అనుభవానికి అక్షర రూపమివ్వటమే. కులానికి-వివక్షకీ , కులానికి-ఆర్ధిక దారిద్ర్యానికి వున్న అవినాభావ సంబంధాన్ని కవి తన కవిత్వంతోకి తీసుకొచ్చిన తీరు గొప్పది. ఊరుకీ-వాడకీ మధ్యనున్న వైరుధ్యంతో కూడిన స్వానుభవాలే కవిత్వాంశాలు ఈ కవికి. ఇది చల్లపల్లి స్వరూపరాణి కవితల సంపుటి "వేకువ పిట్ట". **** మనం తరగతి గదుల్లో చరిత్ర అంటే ఏం చదువుకున్నాం ? మొత్తం భరతజాతి ఒకటిగా వున్నట్లు , ఎవరో విదేశీయులు సిల్క్ రూట్లో గుర్రాలేసుకొచ్చి , లేదా సముద్రం మీద భారీ ఓడలేసుకొచ్చి ఈ దేశాన్ని దోచుకున్నట్లు మాత్రమే చదువుతాం. కానీ ఇదే గడ్డ మీద రకరకాల సమూహాలున్నాయని , అందులో కొన్ని సమూహాలు కొన్ని వేల సంవత్సరాల తరబడి పుట్టుకని బట్టి ప్రయోజనాన్ని పొంది మరికొన్ని సమూహాల్ని అదే పుట్టుక కారణంతో దోచుకున్నాయని , హింసించాయని , ఆ దోచుకునే కారణానికి , వివక్షక...
Comments
Post a Comment