చౌరస్తాలో చెంచు జాతి చల్లపల్లి స్వరూపరాణి అడవిలో మానుల్లో వొకానొక మానులాగా అప్పుడే మోవులు తొడిగిన లేత పచ్చ ఆకులాగా స్వచ్చంగా పెద్దగా మాట్లాడకుండా యితరుల్ని చూస్తే మొహమాటంగా , బిడియంగా కనిపించే రాతియుగపు మనిషికి నికార్సైన ప్రతినిధి చెంచు . చెంచులు ఆదిమ మానవ తెగలలో ద్రావిడ జాతికి చెందిన వొకానొక ఆటవిక తెగకి చెందిన వారు . ' చెట్టు ’, ' చుంచు ’ వంటి పదాల నుంచి ' చెంచు ’ అనే పదం వొచ్చిందని పరిశోధకులు అంటారు . తెలుగు రాష్ట్రాలలో గుర్తించబడిన 33 గిరిజన తెగలలో చెంచులు మిగతా వారందరికంటే మరింత మూలకి నెట్టబడిన వీరు యెక్కువగ కర్నూలు , ప్రకాశం , ప్రస్తుత తెలంగాణా రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలలో విస్తరించిన నల్లమల అడవులలోనూ కృష్ణా , గుంటూరు , కడప మొదలైన జిల్లాలలోని మైదాన ప్రాంతాలలో అరుదుగా నివసిస్తుంటారు . చెంచులు ప్రధానంగా ఆటవిక జాతి వారే ! పాల్కురికి సోమనాధుడు రాసిన ' పండితారాధ్య చరిత్ర ’ లో ఆయన చెంచుల గురించి పేర్కొన్నాడు . నల్లమల అడవిలో వున్న ప్రముఖ శైవ క్ష...
సందేశాత్మక వేకువ పిట్ట! అరణ్యకృష్ణ ఇంతటి సామాజిక దుఃఖాన్ని , ఆక్రోశాన్ని నింపుకున్న కవిత్వాన్ని ఈ మధ్య కాలంలో చదవలేదు. ఇందులో ఉన్నది సానుభూతి కాదు , సహానుభూతీ కాదు. ఉన్నదల్లా గుండెపగుళ్ళ అనుభవానికి అక్షర రూపమివ్వటమే. కులానికి-వివక్షకీ , కులానికి-ఆర్ధిక దారిద్ర్యానికి వున్న అవినాభావ సంబంధాన్ని కవి తన కవిత్వంతోకి తీసుకొచ్చిన తీరు గొప్పది. ఊరుకీ-వాడకీ మధ్యనున్న వైరుధ్యంతో కూడిన స్వానుభవాలే కవిత్వాంశాలు ఈ కవికి. ఇది చల్లపల్లి స్వరూపరాణి కవితల సంపుటి "వేకువ పిట్ట". **** మనం తరగతి గదుల్లో చరిత్ర అంటే ఏం చదువుకున్నాం ? మొత్తం భరతజాతి ఒకటిగా వున్నట్లు , ఎవరో విదేశీయులు సిల్క్ రూట్లో గుర్రాలేసుకొచ్చి , లేదా సముద్రం మీద భారీ ఓడలేసుకొచ్చి ఈ దేశాన్ని దోచుకున్నట్లు మాత్రమే చదువుతాం. కానీ ఇదే గడ్డ మీద రకరకాల సమూహాలున్నాయని , అందులో కొన్ని సమూహాలు కొన్ని వేల సంవత్సరాల తరబడి పుట్టుకని బట్టి ప్రయోజనాన్ని పొంది మరికొన్ని సమూహాల్ని అదే పుట్టుక కారణంతో దోచుకున్నాయని , హింసించాయని , ఆ దోచుకునే కారణానికి , వివక్షక...
Comments
Post a Comment