సందేశాత్మక వేకువ పిట్ట! అరణ్యకృష్ణ ఇంతటి సామాజిక దుఃఖాన్ని , ఆక్రోశాన్ని నింపుకున్న కవిత్వాన్ని ఈ మధ్య కాలంలో చదవలేదు. ఇందులో ఉన్నది సానుభూతి కాదు , సహానుభూతీ కాదు. ఉన్నదల్లా గుండెపగుళ్ళ అనుభవానికి అక్షర రూపమివ్వటమే. కులానికి-వివక్షకీ , కులానికి-ఆర్ధిక దారిద్ర్యానికి వున్న అవినాభావ సంబంధాన్ని కవి తన కవిత్వంతోకి తీసుకొచ్చిన తీరు గొప్పది. ఊరుకీ-వాడకీ మధ్యనున్న వైరుధ్యంతో కూడిన స్వానుభవాలే కవిత్వాంశాలు ఈ కవికి. ఇది చల్లపల్లి స్వరూపరాణి కవితల సంపుటి "వేకువ పిట్ట". **** మనం తరగతి గదుల్లో చరిత్ర అంటే ఏం చదువుకున్నాం ? మొత్తం భరతజాతి ఒకటిగా వున్నట్లు , ఎవరో విదేశీయులు సిల్క్ రూట్లో గుర్రాలేసుకొచ్చి , లేదా సముద్రం మీద భారీ ఓడలేసుకొచ్చి ఈ దేశాన్ని దోచుకున్నట్లు మాత్రమే చదువుతాం. కానీ ఇదే గడ్డ మీద రకరకాల సమూహాలున్నాయని , అందులో కొన్ని సమూహాలు కొన్ని వేల సంవత్సరాల తరబడి పుట్టుకని బట్టి ప్రయోజనాన్ని పొంది మరికొన్ని సమూహాల్ని అదే పుట్టుక కారణంతో దోచుకున్నాయని , హింసించాయని , ఆ దోచుకునే కారణానికి , వివక్షక...
రాచ పుండు ‘థియోగమీ’ చల్లపల్లి స్వరూపరాణి ఇక్కడంతా దేవుడి పేరు మీదే జరుగుతుంది. కవి పైడి తెరేష్ బాబు అన్నట్టు దేవుడు అసమానతల్ని సృష్టించి కొందరి ఆత్మగౌరవాన్ని ధ్వంసం చేస్తాడు. ఈదేశంలో కనీసపు మనిషి హోదా పొందని నికృష్ట జీవి అయిన జోగినీని సృష్టించినదీ ఆ దేవుడే! ఆమధ్య తెలంగాణలో ‘మొగుడనేవాడు మనిషైతే అతడు చనిపోయినప్పుడు నేను వితంతు పెన్షన్ కి అర్హత పొందుతాను, కానీ నా మొగుడు దేవుడైపాయే ఆడెప్పుడు సచ్చేది, పెన్షన్ ఎప్పుడోచ్చేది? అని ఒక జోగినీ అడిగిన ప్రశ్నకి అంతరిక్షంలోకి దూసుకెళ్తున్న నాగరిక సమాజం సమాధానం చెప్పలేదు... ఆమెని సృష్టించిన ఆ మాయదారి దేవుడు బదులు పలకలేడు... ఒకపక్క ప్రభుత్వాధినేతలే పోతురాజుల్ని, జోగినీలను ప్రోత్సహిస్తూ నగరం నడిబొడ్డున జాతర చేస్తూ, ‘రంగం’ చెప్పించుకుంటుంటే జోగినీల ప్రశ...
Comments
Post a Comment